Header Ads

మంగళగిరిలో 4 రూ. భోజన పథకాన్ని ప్రారంభించిన ఆర్కే



ఆళ్ళ రామక్రిష్ణ రెడ్డి అలియస్ ఆర్కె అనుకున్నదే చేసారు. ఈయన గత నెల బంజారహిల్స్ లో 5 రూ. భోజనం చేసారు. భోజనం చేసిన వెంటనే కేసిఆర్ ప్రవేశపెట్టన ఈ పథకం చాలా బాగుందని కితాబిచ్చారు. తన నియోజక వర్గంలో కూడా ఇదే భోజన పథకాన్ని తన సోంత డబ్బులతో ప్రవేశపెడతానని అప్పుడే మీడియాతో చెప్పారు. ఇదే మాట నిజం చేస్తు గుంటూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఈరోజు మధ్యాహ్నం రాజన్న పేరుతో 4 రూ. భోజన పథకాన్ని  ప్రారంభించారు. తన నియోజక వర్గంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కడుపు నిండా భోజనం చేయాలనే ఈ పతకాన్ని ప్రారంభించినట్టు ఆర్కే తెలిపారు. కాగా పప్పు, సాంబార్, పాపడ్, గుడ్డుతో కూడుకున్నటివంటి ఈ 4 రూ భోజనం చాలా బాగుందని అక్కడ ప్రజలు ఆర్కేకు హ్యాట్సాఫ్ చేస్తున్నారు.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.